హైదరాబాద్: భారత పుట్బాల్ జట్టు త్వరలో చైనాతో మ్యాచ్ ఆడనుంది. 21 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఓ స్నేహపూర్వక మ్యాచ్లో తలపడనుండటం విశేషం. ఆసియా కప్ 2019కు సన్నాహకంగా భారత పుట్బాల్ జట్టు చైనాలో పర్యటించనుంది.
చైనాలో భారత పుట్బాల్ జట్టు మ్యాచ్ ఆడబోతుండడం ఇదే తొలిసారి. వచ్చే జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు యుఏఈలో ఏఎఫ్సీ ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నీకి సన్నాహకంగా భారత ఫుట్బాల్ జట్టు అక్టోబర్ 8 నుంచి చైనాలో పర్యటించనుంది.
#IndianFootball team hasn't won a single match in the 17 times they have played #China (lost 12, drawn 5). AIFF hints at FSDL's role in organizing the friendly (IMG sponsor both, Indian and Chinese leagues) https://t.co/IjF8KshomR
— Mihir Vasavda (@mihirsv) July 20, 2018
ఈ మేరకు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, మ్యాచ్ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. మ్యాచ్ను అక్టోబర్ 13(శనివారం) నిర్వహించాలని ఏఐఎఫ్ఎఫ్ భావిస్తోంది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్లో భారత పుట్బాల్ జట్టు 97వ, చైనా 75వ స్థానంలో ఉన్నాయి.
ఈ రెండు జట్లు చివరిసారిగా 1997లో కొచ్చి వేదికగా జరిగిన నెహ్రూ కప్లో పోటీ పడ్డాయి. ఇప్పటి వరకూ చైనాతో 17 మ్యాచ్లు ఆడిన భారత్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే, నాలుగు దేశాల టోర్నీలో భాగంగా ఇటీవలే అండర్-16 భారత జట్టు చైనాలో పర్యటించింది.
India to play 'historic' international friendly against China #BackTheBlue #AsianDream #WeAreIndiahttps://t.co/r9NPrJ1dbx pic.twitter.com/Umx5p0P56Y
— Indian Football Team (@IndianFootball) July 20, 2018