న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

21 ఏళ్ల తర్వాత చైనాతో బీజింగ్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న భారత్

By Nageshwara Rao
India to play China in an international friendly in October in Beijing

హైదరాబాద్: భారత పుట్‌బాల్‌ జట్టు త్వరలో చైనాతో మ్యాచ్‌ ఆడనుంది. 21 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఓ స్నేహపూర్వక మ్యాచ్‌లో తలపడనుండటం విశేషం. ఆసియా కప్‌ 2019కు సన్నాహకంగా భారత పుట్‌బాల్ జట్టు చైనాలో పర్యటించనుంది.

చైనాలో భారత పుట్‌బాల్ జట్టు మ్యాచ్‌ ఆడబోతుండడం ఇదే తొలిసారి. వచ్చే జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1 వరకు యుఏఈలో ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నీకి సన్నాహకంగా భారత ఫుట్‌బాల్‌ జట్టు అక్టోబర్‌ 8 నుంచి చైనాలో పర్యటించనుంది.

ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, మ్యాచ్‌ తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. మ్యాచ్‌ను అక్టోబర్ 13(శనివారం) నిర్వహించాలని ఏఐఎఫ్‌ఎఫ్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పుట్‌బాల్ జట్టు 97వ, చైనా 75వ స్థానంలో ఉన్నాయి.

ఈ రెండు జట్లు చివరిసారిగా 1997లో కొచ్చి వేదికగా జరిగిన నెహ్రూ కప్‌లో పోటీ పడ్డాయి. ఇప్పటి వరకూ చైనాతో 17 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే, నాలుగు దేశాల టోర్నీలో భాగంగా ఇటీవలే అండర్-16 భారత జట్టు చైనాలో పర్యటించింది.

Story first published: Saturday, July 21, 2018, 11:41 [IST]
Other articles published on Jul 21, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X