For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేపాల్ ఆటగాళ్లతో గొడవకు దిగిన భారత జట్టు.. వరుసగా రెండో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో..!

భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు మరీ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ప్లేయర్లు.. అయితే ఆటతో కాకుండా పాకిస్తాన్ ప్లేయర్లతో గొడవతోనే ఈ మ్యాచ్‌కు ఎక్కువ గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌లో మరోసారి భారత ఆటగాళ్లు గొడవ పడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా భారత్ 2-0తో ఘన విజయం సాధించడం గమనార్హం.

బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ల నేపాల్, భారత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 64వ నిమిషంలో ఈ గొడవ జరిగింది. భారత ప్లేయర్ రాహుల్ భేకె.. నేపాల్ ఆటగాడు బిమల్ ఘర్తీ ఇద్దరూ హెడర్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో భేకె కింద పడిపోయాడు. దీంతో కోపం వచ్చిన భేకె.. మగర్ వైపు దూసుకెళ్లాడు. దీంతో రెండు జట్ల ప్లేయర్లు గొడవకు దిగారు.

India and Nepal

అయితే ఈ ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందే.. మహేష్ సింగ్ అందించిన బంతిని టీమిండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీ అద్భుతమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో భారత్‌కు 1-0 ఆధిక్యం దక్కింది. అనంతరం 70వ నిమిషంలో ఛెత్రీ అందించిన అసిస్ట్‌ను అందుకున్న మహేష్ సూపర్ గోల్‌తో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది. ఈ విజయంతో భారత జట్టు సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంది.

India and Nepal

అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మేనేజర్ ఇగొర్ స్టిమాక్ వల్ల గొడవ జరిగింది. త్రో-ఇన్ తీసుకుంటున్న పాక్ ప్లేయర్‌ను అడ్డుకున్న స్టిమాక్.. అతని చేతుల్లో నుంచి బంతిని కింద పడేశాడు. దీంతో భారత్, పాక్ రెండు జట్ల ఆటగాళ్లు మైదానంలోనే కొట్టుకున్నారు. ఈ గొడవలో స్టిమాక్‌కు రెడ్ కార్డు ఇచ్చారు అంపైర్లు. అలాగే స్టిమాక్‌ను మైదానంలో నుంచి బయటకు పంపేశారు కూడా.

Story first published: Sunday, June 25, 2023, 17:07 [IST]
Other articles published on Jun 25, 2023
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+