
విజయంపై హితబోధ చేశా
కానీ ఆత్మనూన్యతా భావంతో సతమతమవుతున్నారని, కానీ తమదైన శైలిలో మ్యాచ్ ఆడితే విజయం సాధించగలరని హితబోధ చేశానని హబాస్ వ్యాఖ్యానించాడు. రెండు మ్యాచ్ల మధ్య ఎక్కువ సమయం అవసరమని తెలిపాడు. ఇప్పుడు తాము నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో జరిగే మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నామని, భారీగా ప్రయాణం చేయాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్నాడు. ఎక్కువ సమయం కోలుకోవడంపైనే ఫోకస్ చేయాల్సి వస్తున్నదన్నాడు.

సెమీస్ చోటు కోసం ఆలోచించడం లేదు
తాము సెమీ ఫైనల్స్ లో చోటు కోసం ఆలోచించడం లేదని, నార్త్ఈస్ట్ జట్టుతో జరిగే మ్యాచ్ పై కేంద్రీకరించామన్నాడు. సీరియస్ గా ద్రుష్టి సారిస్తే విజయం సాధించొచ్చని తమ కుర్రాళ్లు రుజువుచేశారన్నాడు. తాము టాప్ 4లో నిలబడాలంటే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమతూకం చేయడం చాలా ముఖ్యం అన్నాడు. 22న నార్త్ఈస్ట్ జట్టుతో గౌహతిలో పుణె జట్టు తలపడనున్నది.

పున:సమీక్షకిది చాన్స్: జంబ్రొట్టా
పుణె జట్టుతో తమ ఓటమి తమకు ఒక గుణపాఠం వంటిదని ఢిల్లీ డైనమోస్ చీఫ్ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు. తమ జట్టు ప్లేయర్ల ప్రతిభ, వ్యూహం తదితర అంశాలను మరోసారి సమీక్షించుకుంటామన్నాడు. పుణెతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైనా ఢిల్లీ జట్టు 11 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నది. తాము చాలా క్లిష్టమైన, బెస్ట్ టీంతో తలపడుతున్నామని తమ కుర్రాళ్లకు తెలుసునని జంబ్రొట్టా అన్నాడు. ఫస్టాఫ్ లో తమ కుర్రాళ్లు చాలా పొరపాట్లు చేశారన్నాడు.

అవకాశాన్ని సద్వినియోగం
రెండు గోల్స్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవడం కష్టసాధ్యంగా పరిణమించిందన్నాడు. కొన్నిసార్లు ఓటమి కూడా ముందడుగు వేసేందుకు సాయపడుతుందని చెప్పాడు. పాజిటివ్ కోణంలో మ్యాచ్ ఆడాలని జంబ్రొట్టా పదేపదే ఢిల్లీ కుర్రాళ్లకు ఉద్బోధించాడు. ప్రతి మ్యాచ్లోనూ గోల్స్ సాధించే సామర్థ్యం అవసరమేనన్నాడు. తాము మరో మూడు గేమ్స్ ఆడాల్సి ఉన్నదని, వాటిల్లో విజయం ద్వారా సెమీస్ బెర్త్ను సంపాదిస్తామని జంబ్రొట్టా అన్నాడు. దూకుడుగా ఆడే ఫుట్బాల్ మ్యాచ్లో ఢిల్లీ ప్రారంభంలోనే లీడ్ సాధించినా ముందుకు వెళ్లలేకపోయింది.

చివరి క్షణంలో విజయం
పాజిటివ్ గా ఆడటం వల్ల చివరి క్షణంలో విజయం సాధించగలమని, అదే తమకు అతిపెద్ద పాజిటివ్ అంశమన్నాడు జంబ్రొట్టా. అదే సమయంలో తాము ఎదుర్కొనే జట్టు, దాని శక్తి సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవరం ఉన్నదని స్పష్టం చేశాడు. తాము అద్యంతం అటాకింగ్ ధోరణితో మ్యాచ్ ఆడినా దురద్రుష్టవశాత్తు రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యామన్నాడు. మరికొన్ని గోల్స్ చేయాల్సి ఉన్నా.. లక్ష్యాలను అందుకోలేకపోయామన్నాడు. తాము ఎక్కడ పొరపాటు చేశామో సమీక్షించుకుంటామని జంబ్రొట్టా తెలిపాడు. ఈ నెల 27న ఎఫ్ సి గోవా జట్టుకు ఢిల్లీ ఆతిథ్యమివ్వనున్నది.


Click it and Unblock the Notifications













