
డబుల్ ట్రోఫీలు స్పెషల్: గంగూలీ
కేవలం మూడేళ్లలోనే రెండోసారి తమ జట్టు ఐఎస్ఎల్ టైటిల్ గెలుచుకోవడం తనకు అత్యంత ప్రత్యేకమని అట్లెటికో డి కోల్ కతా సహ యజమాని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ‘రెండు విజయాలు ప్రత్యేకమే' అని వ్యాఖ్యానించాడు. ‘కుర్రాళ్లకు అభినందనలు, మ్యాచ్లో విజయం సాధించడంలో వారంతా ధ్రుడ సంకల్పం ప్రదర్శించారు' అని తెలిపాడు.

ఉద్వేగం, కేరింతలు చూసి భయపడ్డా
ఒకానొక దశలో కేరళ లీడ్లో ఉన్నప్పుడు ఎల్లో షర్టులతో కూడిన అభిమాన జన సందోహం ఉద్వేగం, కేరింతలు చూసి భయపడ్డానని పేర్కొన్నాడు. టైటిల్ కోసం సాగిన మ్యాచ్ ను వీక్షించేందుకు రెండు గంటల ముందే అభిమానులు రావడంతో స్టేడియంలో రద్దీ ఏర్పడింది.

ఇండియన్ ఫుట్బాల్ పునర్వ్యవస్థీకరణ దిశగా ఎఐఎఫ్ఎఫ్ అడుగులు
భారతీయ ఫుట్ బాల్ ను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తామని అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. ఇందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటుచేశామని మీడియాకు చెప్పారు. ఈ టాస్క్ఫోర్స్లో ఏషియాన్ ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి), ఫిఫా ప్రతినిధులు సభ్యులుగా తమకు మార్గదర్శకత్వం వహిస్తారన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్ ను సుదీర్ఘ కాలం నిర్వహించే అంశం ఒకటి, రెండేళ్లలో ఖరారవుతుందన్నాడు.

యు-17 వరల్డ్ కప్ టోర్నీ పూర్తైన తర్వాతే
తదుపరి ఐఎస్ఎల్ టోర్నీ వచ్చే ఏడాది యు-17 వరల్డ్ కప్ టోర్నీ పూర్తయిన తర్వాత మొదలవుతుందన్నారు. అయితే ఇది చాలా సంక్లిష్టమైన అంశమన్నాడు. ఇప్పటికే సుదీర్ఘ కాలంగా వారసత్వ క్లబ్ లుగా కొనసాగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదన్నాడు. వచ్చే ఏడాది నుంచి ఐఎస్ఎల్ టోర్నీ సుదీర్ఘంగా సాగుతుందని సంకేతాలిచ్చాడు. ఐ - లీగ్ కేవలం రెండున్నర నెలలకు బదులు కొన్ని నెలల పాటు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నాడు. కానీ కొన్ని క్లబ్ ల యాజమాన్యాలు విభేదిస్తున్నాయని కుశాల్ దాస్ చెప్పాడు.


Click it and Unblock the Notifications













