తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి
ఈ టోర్నీ ద్వారా తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ప్రపంచకప్ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లు ఆడినందుకు అతడికి 22,500 డాలర్లతో పాటు ఫైనల్లో విజేతగా నిలిచినందుకు సుమారు 3.5లక్షల డాలర్లను అదనంగా అందుకోనున్నాడు. ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ద్వారా ఎంబపె అసలు అందుకోవాల్సింది సుమారు 5లక్షల డాలర్లు.
క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న
భారత కరెన్సీలో సుమారు రూ.3.4 కోట్లకు పైనే. ఈ మొత్తాన్ని అతడు ఛారిటీకి ఇవ్వనున్నట్లు తెలిపి తన దాతృత్వాన్ని చాటాడు. క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఈ మొత్తాన్ని వాడాలని స్వచ్ఛంద సంస్థను ఎంబపె కోరాడట.
అభిమాన ఆటగాళ్లకు హైఫై
అభిమానులతోనూ అదే స్థాయిలో స్పందిస్తున్నాడు. క్రొయేషియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ 53వ నిమిషంలో ఓ నలుగురు అభిమానులు ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మైదానమంతా పరుగెత్తారు. అంతటితో ఆగకుండా అభిమాన ఆటగాళ్లకు హైఫై ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఓ మహిళా అభిమానికి ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపే హైఫై ఇచ్చాడు.
ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటో
మ్యాచ్ అనంతరం 'మైలవ్' అనే క్యాప్షన్తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. 'కైలిన్ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే' అని ట్వీట్ చేశాడు. అంతకు ముందు 'వెలకమ్ టూ ది క్లబ్' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి.