శాన్సాల్విడార్: మధ్య అమెరికాలోని దేశమైన ఎల్సాల్విడర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాన్ సాల్విడార్ నగరానికి ఉత్తరాన ఉన్న ఓ మైదానంలో ఫుట్బాల్ టోర్నమెంటు జరుగుతుండగా.. కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

ఈ ఘటనలో ఐదుగురు క్రీడాకారులు మైదానంలోనే మరణించారు. వారంతా ఒకే ఫుట్బాల్ టీం సభ్యులు. రెండు ముఠాల మధ్య నెలకొన్న భూ వివాదమే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాల్పుల్లో గాయపడిన మరికొందరు ఆటగాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.