హైదరాబాద్: అండర్-17 పుట్బాల్ వరల్డ్ కప్కి భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ పుట్ బాల్ జట్టు తన తొలి మ్యాచ్లో అమెరికాతో తలపడనుంది. గ్రూప్ ఏలో భారత్ జట్టుతో పాటు అమెరికాతో పాటు కొలంబియా, ఘనా ఉన్నాయి.
టోర్నీ డ్రాను శుక్రవారం ప్రకటించారు. ఈ డ్రాను స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రకటించింది. టోర్నీలో మొత్తం 24 జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లు ఉన్నాయి. అక్టోబరు 6న ఢిల్లీలో టోర్నీ ఆరంభమవుతుంది.
తొలి మ్యాచ్లో భారత్, అమెరికా తలపడతాయి. ఆ తర్వాత భారత్ పుట్బాల్ జట్టు 9న కొలంబియాను, 12న ఘనాతో ఆడుతుంది. గ్రూప్ దశ 16న ముగుస్తుంది. తర్వాత ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్కి సంబంధించిన మ్యాచ్లు జరుగుతాయి. 28న ఫైనల్కు కోల్కతా ఆతిథ్యమిస్తుంది.
తొలి మ్యాచ్లో భారత్, అమెరికా తలపడతాయి. ఆ తర్వాత భారత్ పుట్బాల్ జట్టు 9న కొలంబియాను, 12న ఘనాతో ఆడుతుంది. గ్రూప్ దశ 16న ముగుస్తుంది. తర్వాత ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్కి సంబంధించిన మ్యాచ్లు జరుగుతాయి. 28న ఫైనల్కు కోల్కతా ఆతిథ్యమిస్తుంది.
అండర్-17 పుట్బాల్ వరల్డ్ కప్ గ్రూపు వివరాలు:
గ్రూప్ A: India, USA, Ghana, Colombia
గ్రూప్ B: Turkey, Mali, New Zealand, Paraguay
గ్రూప్ C: Iran, Guinea, Germany, Costa Rica
గ్రూప్ D: North Korea, Niger, Brazil, Spain
గ్రూప్ E: Honduras, Japan, New Caledonia, France
గ్రూప్ F: Iraq, Mexico, Chile, England.