హైదరాబాద్: భారత్ తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ చివరిదశకు చేరుకుంది. టోర్నీలో భాగంగా కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడింయలో శనివారం (అక్టోబర్ 28)న ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్లు హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి.
ఫిఫా వరల్డ్ కప్: బ్రెజిల్ కథ ముగిసింది, ఫైనల్లో ఇంగ్లాండ్ Vs స్పెయిన్
పైనల్ మ్యాచ్కి ఆతిథ్యం ఇస్తున్న సాల్ట్ లేక్ స్టేడియం ఇప్పటికే అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దగ్గరుండి పర్వవేక్షిస్తోంది. ఫిఫా వరల్డ్ కప్కు సంబంధించి ఏ దశ టోర్నీకైనా భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
దీంతో ఆ బాధ్యతలను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఫిఫా అధ్యక్షుడు, ఏఐఎఫ్ఎఫ్ సుప్రిమో ప్రపుల్ పటేల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు భారత పుట్బాల్ దిగ్గజాలు హాజరుకానున్నారు.
ఫిఫా అండర్-17కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో 'సచిన్తో కలిసి ఫైనల్ మ్యాచ్ను స్వయంగా వీక్షిస్తాను' అని గంగూలీ గురువారం మీడియాకు తెలిపాడు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన బ్రెజిల్ని మట్టికరిపించి తొలిసారి ఇంగ్లాండ్ యు-17 ఫైనల్కు చేరింది.
బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో బ్రెజిల్ 3-1తో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఆటగాడు రియాన్ బ్రూస్టర్ రికార్డుస్థాయిలో రెండోసారి హ్యాట్రిక్ గోల్స్ సాధించి తన జట్టును ఫైనల్ చేర్చాడు. దీంతో ఈ టోర్నీలో ఇప్పటివరకు క్వార్టర్స్ కూడా చేరుకుని ఇంగ్లాండ్ జట్టు తొలిసారి ఫైనల్కు అర్హత సాధించింది.