
మణిపూర్ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది
ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) 21 మందితో జట్టును ప్రకటించింది. వీరిలో వెనుకబడిన ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో కెప్టెన్ అమర్జీత్సింగ్తో సహా గోల్కీపర్ ధీరజ్సింగ్, జాక్సన్సింగ్, నాంగ్దామ్బా నోరెమ్, సారా జహాన్, బోరిస్సింగ్, సురేశ్సింగ్, నింగ్తోయి గంబా ఉన్నారు.

ఫుట్బాల్పై ప్రేమతో జాతీయస్థాయికి
పూట గడువని పేద కుటుంబాల నుంచి వచ్చినా వీరంతా ఫుట్బాల్పై ప్రేమతో జాతీయస్థాయికి ఎదిగారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తల్లిదండ్రులు, కోచ్ల ప్రోత్సాహంతో ప్రపంచకప్ ఫుట్బాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వీరంతా ఇలా వెలుగులోకి రావడానికి కారణం జర్మనీకి చెందిన నికోల్ ఆడమ్సే కారణమని అంటున్నారు వారి తల్లిదండ్రులు.

అండర్-17 సాకర్ జట్టు కోచ్గా బాధ్యతలు
2015లో భారత అండర్-17 సాకర్ జట్టు కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆడమ్స్ తొలుత దృష్టిపెట్టింది ఈశాన్య రాష్ర్టాలపైనే. దేశం మొత్తం కలియతిరిగినా అతనికి కావాల్సిన ప్లేయర్లు దొరకలేదు. దీంతో ఈశాన్య రాష్ర్టాలపై గురిపెట్టిన ఆడమ్స్కు అద్భుతమైన ప్లేయర్లు తారసపడ్డారు. అనుకున్నదే తడవుగా మేఘాలయ, సిక్కిం, మిజోరాం, మణిపూర్ రాష్ర్టాల నుంచి కొంత మంది సాకర్ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాడు.

మణిపూర్ కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చిన ఆడమ్స్
ముఖ్యంగా మణిపూర్ కుర్రాళ్లు తగినంత ఎత్తు, శరీర సౌష్టవంలో మిగతా వాళ్లతో పోలిస్తే మెరుగ్గా కనిపించారు. జాతీయ జట్టులో కచ్చితంగా రాణిస్తారని అనుకున్న ఆడమ్స్ మణిపూర్ కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చాడు. కోచ్ నమ్మకాన్ని నిలబెట్టిన యువకులు మెరికల్లాగా తయారయ్యారు. ఒక్క మణిపూర్ నుంచే జాతీయ జట్టుకు ఇంత మంది ఎంపిక కావడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని అర్జున అవార్డు గ్రహీత, భారత మహిళల మాజీ ఫుట్బాల్ ప్లేయర్ ఒయినమ్ బొంబేమ్ దేవి పేర్కొంది.

భారత ఫుట్బాల్పై ఈశాన్య రాష్ట్రాల ఆధిపత్యం
భారత ఫుట్బాల్పై ఈశాన్య రాష్ట్రాల ఆధిపత్యం చూస్తే సంతోషంగా ఉందని వెల్లడించింది. తమదైన రోజునా ఎవరినైనా ఓడించే సత్తా వారి సొంతమని ఆమె పేర్కొంది. ఇక, మణిపూర్ ఎఫ్ఏ కార్యదర్శి రంజీత్రాయ్ మాట్లాడుతూ 'ఫుట్బాల్ ప్రపంచకప్తో దేశ భవిష్యత్ మారబోతోంది. సాకర్ పట్ల మరింత ఆసక్తి పెరిగేందుకు ఆస్కారముంది. దేశం యావత్తు మణిపూర్లో శిక్షణ పొందేందుకు వచ్చే అవకాశముంది. భారత్ ఫుట్బాల్ పవర్హౌజ్గా మారితే మణిపూర్ అందులో కీలక భూమిక పోషిస్తుంది' అని రాయ్ అన్నాడు.


Click it and Unblock the Notifications













