హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం కోల్కతాలో అభిమానులు పోటీపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం గౌహతిలో జరగాల్సి ఉంది. అయితే అక్కడ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగే ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియం అంతా చిత్తడిగా మారింది.
దీంతో టోర్నీ నిర్వాహకులు మ్యాచ్ని కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి మార్చారు. సెమీ ఫైనల్లో భాగంగా బ్రెజిల్ జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు బ్రెజిల్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించడం విశేషం. దీంతో పుట్బాల్ అభిమానులు ఈ మ్యాచ్పై తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు.

కోల్కతాలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా బారులు తీరి టికెట్లని కొనుగోలు చేస్తున్నారు.
సెమీ పైనల్:
బ్రెజిల్ Vs ఇంగ్లాండ్ (సాయంత్రం 5 గంటలకు)
మాలి Vs స్పెయిన్ (రాత్రి 8 గంటలకు)