హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన బ్రెజిల్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గ్రూప్ డిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ 2-0తో నైగర్ను ఓడించింది.
మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ మ్యాచ్ ఆరంభం నుంచే తన దూకుడుని ప్రదర్శించింది. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిమిషంలోనే బ్రెజిల్ స్ట్రయికర్ లింకోల్న్ గోల్ సాధించాడు. ఆ తర్వాత 34వ నిమిషంలో ఫార్వర్డ్ బ్రెన్నర్ మరో గోల్ చేసి బ్రెజిల్కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు.
తాజా విజయంతో బ్రెజిల్ 9 పాయింట్లతో అగ్రస్థానంతో గ్రూప్ దశను ముగించింది. ఈ టోర్నీలో శనివారంతో గ్రూప్ దశ ముగియనుంది. ఇదిలా ఉంటే ఇదే గ్రూప్లో జరిగిన మరో మ్యాచ్లో స్పెయిన్ 2-0తో ఉత్తర కొరియాపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీలో చివరి రోజైన శనివారం ఫ్రాన్స్తో హోండురస్.. జపాన్తో న్యూ కలెడోనియా.. మెక్సికోతో చిలీ.. ఇంగ్లాండ్తో ఇరాక్ తలపడనున్నాయి.