బెర్న్: ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మిచెల్ ప్లాటినీలను ఎనిమిదేళ్లపాటు ఫుట్బాల్ సంబంధిత ఏ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఫిఫా ఎథిక్స్ కమిటీ నిషేధించింది. లంచం, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై విచారించి ఈ తీర్పును వెలువరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
2మిలియన్ డాలర్ల అవినీతి పాల్పడినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. బ్లాటర్, ప్లాటినీలు పదవులను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ పేర్కొంది.
కాగా, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఫిఫా కోసం పోరాటం తన పోరాటం కొనసాగిస్తానని 79ఏళ్ల బ్లాటర్ తెలిపారు. తాను ఇప్పటికీ ఫిఫా అధ్యక్షుడినేనని ప్రకటించుకున్నారు. నిషేధం విధించడంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.