హైదరాబాద్: భారత జాతీయ ఫుట్బాల్ గతేడాది కంటే ఈ ఏడాది ఫలితాల్లో కాస్త మెరుగు పడింది. ఫుట్బాల్ క్రీడకు సమన్వయంగా వ్యవహరించే ఫిఫా ఈ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. నిరుడు 105గా ఉన్న భారత్ ర్యాంకు ఈ ఏడాది 102కు చేరింది.
భారత జట్టును బ్లూ టైగర్స్గా పరిగణిస్తూ 2017 డిసెంబరు వరకు ఆడిన ఫలితాల ఆధారంగా 13 పాయింట్లు పెరిగాయని సూచించింది. దీంతో భారత్కు ఇప్పటికి 333 రేటెడ్ పాయింట్లు ఉన్నాయన్నమాట.
గతేడాది భారత్ ఆడిన తొమ్మిది గేమ్లలో ఏడింటిలో గెలిచింది. మిగతా రెండు డ్రాగా ముగిశాయి. దీంతో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో జరగనున్న( ట్రై నేషన్ సిరీస్) ముక్కోణపు సిరీస్లో ఆడేందుకు అర్హత సాధించింది.
ప్రస్తుతం టాప్ పొజిషన్లో ప్రపంచ కప్ విజేత అయిన జర్మనీనే కొనసాగుతుంది. అలాగే మొదటి పద్నాలుగు స్థానాల్లోనూ ఎలాంటి మార్పులు లేకుండా అలానే కొనసాగుతున్నాయి. గతేడాది ఫలితాలను బట్టి చూస్తే ఈ ఏడాది కువైట్ చాలా మెరుగ్గా రాణించింది. ఏకంగా 15 స్థానాలు దాటి 174 వ స్థానంలో ఉంది.