ఇరు జట్లు దూకుడు
పైనల్లో ఆరంభం నుంచే ఇరు జట్లు దూకుడుని ప్రదర్శించాయి. 5వ నిమిషంలో స్పెయిన్ టికి-టకా పాసింగ్తో ఇంగ్లండ్ పోస్టుపై దాడి చేసింది. అయితే బ్రూస్టర్, ఫోడెన్, వైట్ వారి నుంచి బంతిని తప్పించగలిగారు. కానీ, 10వ నిమిషంలో జువాన్ మెరిండా క్రాస్ను అందుకున్న గోమెజ్.. ఇంగ్లండ్ పోస్టుకు అతి సమీపం నుంచి బంతిని నెట్లోకి పంపి స్పెయిన్ను 1-0 ఆధిక్యంలో నిలిపా
44వ నిమిషంలో ఇంగ్లాండ్కు బ్రేక్
ఆ తర్వాత అతడే 31వ నిమిషంలో అబెల్ రుయిజ్ నుంచి బంతిని అందుకున్న అతడు ఎడమకాలితో గోల్ కొట్టడంతో స్పెయిన్ 2-0 ఆధిక్యం సాధించింది. అయితే విరామానికి ఒక్క నిమిషం ముందు అంటే 44వ నిమిషంలో డబుల్ హ్యాట్రిక్ బోయ్ రియాన్ బ్రూస్టర్ ఇంగ్లాండ్కు బ్రేక్ అందించాడు. కుడి వైపు నుంచి సెసెగ్నాన్ ఇచ్చిన చక్కని క్రాస్ను అతడు తలతో నెట్లోకి కొట్టాడు.
రెండో అర్ధభాగంలో పూర్తిగా మారిపోయిన ఆట
ఇక రెండో అర్ధభాగంలో ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయింది. దూకుడు అమాంతం పెంచిన ఇంగ్లాండ్ మరితంగా రెచ్చిపోయింది. వరుస దాడులతో స్పెయిన్ డిఫెన్స్ను ఉక్కిరిబిక్కిరి చేసిది. చకచకా నాలుగు గోల్స్ కొట్టి 5-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 58వ నిమిషంలో వైట్ 2-2తో స్కోరు సమం చేశాడు.
స్పెయిన్ డిఫెన్స్ను కకావికలం చేసిన ఇంగ్లాండ్ జట్టు
సెసెగ్నో లోక్రాస్ను అందుకున్న వైట్.. నేరుగా గోల్ చేసి 2-2తో స్కోరు సమం చేశాడు. ఇక్కడి నుంచి మరింత దూకుడు పెంచిన ఇంగ్లాండ్ జట్టు స్పెయిన్ డిఫెన్స్ను కకావికలం చేసింది. 69వ నిమిషంలో ఫొడెన్ గోల్తో 3-2 ఆధిక్యం సంపాదించింది. 84వ నిమిషంలో ఇంగ్లండ్ నాలుగో గోల్ సాధించింది.
30 నిమిషాల వ్యవధిలోనే నాలుగు గోల్స్ కొట్టిన ఇంగ్లాండ్
ఇలా, ఇంగ్లాండ్ 30 నిమిషాల వ్యవధిలోనే నాలుగు గోల్స్ కొట్టి స్పెయిన్కు మ్యాచ్ను దూరం చేసింది. మరో నాలుగు నిమిషాల తర్వాత ఫోడెన్ రెండో గోల్ చేయడంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది. టోర్నీలో ఇంతవరకు క్వార్టర్స్ దాటని ఇంగ్లాండ్ జట్టు ఫైనల్కు చేరిన తొలిసారే విశ్వవిజేతగా అవతరించింది.
మూడో స్ధానంలో బ్రెజిల్
టోర్నీకి ముందు ఫేవరేట్గా బరిలోకి దిగిన బ్రెజిల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బ్రెజిల్ 2-0తో మాలిని ఓడించింది. 55వ నిమిషంలో అలెన్, 88వ నిమిషంలో యూరి అల్బర్టో గోల్స్తో బ్రెజిల్ను గెలిపించాడు.
హాజరులో కొత్త చరిత్ర
అండర్-17 ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన టోర్నీగా ఇది రికార్డుల్లోకెక్కింది. ఈ టోర్నీని మొత్తం 13,47,143 మంది వీక్షించారు. 1985లో చైనాలో జరిగిన టోర్నీకి 12,30,976 మంది హాజరయ్యారు. ఇప్పటిదాకా అదే రికార్డు. అప్పటికంటే అదనంగా 1,16,167 ప్రస్తుత టోర్నీని ప్రత్యక్షంగా చూడటం విశేషం. అండర్-20 ప్రపంచకప్ రికార్డు (13,09,929, కొలంబియా-2011)ను కూడా ప్రస్తుత టోర్నీ దాటేసింది. సీనియర్ స్థాయి కాకుండా ఏ వయసు విభాగంలోనైనా ఫుట్బాల్ వరల్డ్ కప్లో కూడా ఇదే రికార్డు.
టోర్నీలో మొత్తం నమోదైన గోల్స్ 179
ఈ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్ల్లో 177 గోల్స్ నమోదయ్యాయి. అండర్-17 ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ అయిన టోర్నీ ఇదే. 2013 అమెకారిలో జరిగిన టోర్నీ 172 గోల్స్ రికార్డును ఈ టోర్నీ అధిగమించింది.