లక్నో: జాతీయ మహిళా పుట్బాల్ క్రీడాకారిణి పూనమ్ చౌహాన్ డెంగ్యూతో మరణించింది. ఈ మేరకు బుధవారం అధికారులు ప్రకటన చేశారు. డెంగ్యూ కారణంగా ఆమె మంగళవారం రాత్రి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బుధవారం నగరంలోని మకర్ణికా ఘాట్లో ఆమె మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 2007-10 మధ్య కాలంలో పూనమ్ జాతీయ ఫుట్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున జాతీయ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పదిసార్లు ఆడింది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో డెంగ్యూ ప్రబలింది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనే ఈ డెంగ్యూ కారణంగా 200 మందికిపైగా మరణించారు.