హైదరాబాద్: ప్రీమియర్ లీగ్లోని ప్రధానమైన ఫుట్బాల్ జట్టు చిల్సీ భారీ ఎత్తుగడ వేసింది. తన టీంను బలపర్చుకునేందుకు భారీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే మాస్కో జట్టు మిడ్ ఫీల్డర్ అలెక్సాండర్ గొలివిన్ను టార్గెట్ చేసింది. కాగా, అతనికి 15 మిలియన్ బ్రిటిష్ పౌండ్లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అంటే ఇది దాదాపు 130 కోట్ల రూపాయలు అన్నమాట.
జట్టును నడిపిస్తున్న ఆంటోనియో కాంటె కోసం జియోలోవిన్ను తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జనవరి నెలాఖరు లోపే అతనని జట్టులోకి తీసుకోనుంది. లేకుంటే జియోలోవిన్ ఇక ఇంటికే. మున్ముందు జరగబోయే వరల్డ్ కప్ లీగ్లను దృష్టిలో ఉంచుకొని అతనిని వేలంలో కొనే యోచనలో ఉంది.
నెమెంజా మాటిక్ టీంను వదిలి వెళ్లిపోయిన క్రమంలో మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు తీవ్ర లోటు ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు మేనేజర్ అబ్రమోవిచ్ కొత్త పద్ధతులను అవలంభిస్తున్నాడు. రిక్రూట్మెంట్ దశ నుంచి అన్ని విషయాలను చిల్సీ క్లబ్ యజమాని ఆంటోనియోకు తెలిసేలా చేస్తున్నాడు. అబ్రమోవిచ్కు యూరప్లో ఉన్న పరిచయాల ద్వారా జియోలొవిన్ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.