హైదరాబాద్: వచ్చే రష్యా అతిథ్యమిస్తోన్న ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీల్లో తమ దేశం నెగ్గి తీరాలనే పట్టుదల ఇంగ్లాండ్లో మరింత కనపిస్తుంది. ఈ పట్టుదల వెనుక ఓ కారణం ఉంది. ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ గనుక గెలిస్తే పారితోషకంతో పాటు బోనస్ను కూడా ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.
వరల్డ్ కప్ చేజిక్కించుకోవాలనే ధ్యేయంతో క్రీడాకారులకు బోనస్ గా పెద్ద మొత్తంలో నగదును వెచ్చించింది. ఏకంగా ఫుట్బాల్ క్రీడాకారులకి ఐదు మిలియన్ బ్రిటిష్ పౌండ్లు నగదుగా ప్రకటించింది. అంటే దాదాపు 43 కోట్ల 26 లక్షలు. జట్టులో ఉన్న 23 మంది పంచుకుంటే ఒకొక్కరికి రూ. కోటి ఎనబై ఆరు లక్షలు రానున్నాయి.
అంతే స్థాయిలో వారిలో ఉత్సాహాన్ని పెంచాలనే నెపంతో గెలుపొందిన స్థాయిని బట్టి బహుమతిని మునుపటి కంటే మెరుగైన స్థాయిలో ఇవ్వనుంది. కానీ, వాళ్లు గ్రూపు స్టేజిలోనే తిరిగొస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా దక్కదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.