హైదరాబాద్: గోల్ కీపర్ నీరజ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఏఎఫ్సీ అండర్-16 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో సోమవారం ఇరాన్తో జరిగిన మ్యాచ్ను భారత్ 0-0తో డ్రాగా ముగించింది. ఇలా 33 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ఇరాన్తో మ్యాచ్ను డ్రా చేసుకుంది.
ఏ వయసు విభాగాల్లో అయినా చివరగా ఇరాన్ను భారత్ 1984 ఆసియా కప్ ఫైనల్లో నిలువరించింది. ఆ మ్యాచ్ కూడా గోల్సేమీ నమోదు కాకుండా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో తనకంటే ఎంతో మెరుగైన ఇరాన్ను భారత యువ జట్టు కట్టడి చేసిన తీరు నిజంగా అద్భుతం.
76వ నిమిషంలో ఆ జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్ కీపర్ నీరజ్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ''ఈ మ్యాచ్ గెలవాల్సింది. మంచి ప్రదర్శన కనబరిచాం. కుర్రాళ్లు వంద శాతం కృషి చేశారు. ప్రణాళిక ప్రకారం ఆడారు'' అని ప్రధాన కోచ్ బిబియానో ఫెర్నాండెస్ తెలిపాడు.