|
ఫినిషింగ్ లోపంతో
గోల్ చేసేందుకు పలుమార్లు అవకాశాలు వచ్చినా ఫినిషింగ్ లోపంతో భారత ఫుటబాల్ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. యూఏఈ ఆటగాళ్లు ఖల్ఫాన్ ముబారక్(41వ నిమిషం), అలీ అహ్మద్ మక్భూత్ (88వ నిమిషం) గోల్స్ కొట్టి జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో భారత్ గట్టిగానే పోరాడినా.. యూఏఈ జట్టు ముందు నిలువలేకపోయింది.
|
సమానమైన అవకాశాలు
యూఏఈ ఆటగాళ్లు పాస్లను చక్కగా అందుకోవడంతో బంతి ఎక్కువ శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. ఆరంభంలో రెండు జట్లకు సమానమైన అవకాశాలు వచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై పలుమార్లు దాడులు ప్రయత్నించినప్పటికీ... ఫౌల్స్ ఎక్కువగా చేసింది. అంతేకాదు పాస్లలో సైతం వెనుకబడింది.
|
బహ్రెయిన్పై గెలిస్తే నాకౌట్ అవకాశాలు
సందేశ్ జిగన్స్ కొట్టిన కార్నర్ షాట్ను అనురిధ్ థాపా హెడ్డర్ గోల్పోస్ట్ సమీపం నుంచి బయటకు దూసుకెళ్లింది. దీంతో భారత ప్రయత్నం వృథాగా మారింది. ఈ మ్యాచ్లో ఓడినా భారత్కు నాకౌట్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్లో రెండో స్థానంలో భారత్... సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో బహ్రెయిన్తో భారత్ గెలిస్తే ముందంజ వేస్తుంది.