హైదరాబాద్: భారత పుట్బాల్ జట్టు మరో అరుదైన ఘనత సాధించింది. ఫిపా ప్రకటించిన తాజా ర్యాంకుల్లో 100లోపు చోటు దక్కించుకుంది. 21 ఏళ్ల తర్వాత భారత జట్టు ఈ ఘనత సాధించింది. ఫిపా ప్రకటించిన తాజా ర్యాంకుల్లో నికరాగువా, లిథువేనియా, ఈస్టోనియాతో కలిసి భారత పుట్ బాల్ జట్టు 100వ ర్యాంకులో నిలిచింది.
చివరిసారిగా భారత పుట్ బాల్ జట్టు 1996లో 100 ర్యాంకులలోపు నిలిచింది. ఫిబ్రవరి 1996లో ఫిపా ప్రకటించిన ర్యాంకుల్లో 94వ ర్యాంకులో నిలిచింది. ఇదే ఇప్పటివరకు భారత పుట్ బాల్ జట్టు సాధించిన అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం.

కంబోడియా, మయన్మార్తో జరిగిన మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించడంతో తన ర్యాంకుని మెరుగుపరుచుకుంది. కాగా, ప్రెండ్లీ మ్యాచ్లో భాగంగా జూన్ 7వ తేదీన లెబనాన్తో భారత్ తలడనుంది.