
151పరుగుల
151పరుగుల తేడాతో బంగ్లాపై గెలిచి చరిత్ర సృష్టించింది. నార్త్ ఈస్టరన్ సిటీలోని సైలెట్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో తొలి టెస్టును గెలిచి శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ ఐదేళ్లలో ఇదే తొలి విజయం. జింబాబ్వే స్పిన్నర్ బ్రెండన్ మవుతా అరంగ్రేట మ్యాచ్లోనే 21పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతనితో పాటుగా సికందర్ రజా 3-41గా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 169 పరుగులు చేసింది.

జింబాబ్వే 282.. చేయగా బంగ్లా143
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో భాగంగా ఇమ్రుల్ కైస్(43), అరిఫుల్ హక్(38), లిటన్ దాస్(23)లు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించగా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టును 1-0ఆధిక్యంతో జింబాబ్వే ఓడించింది. తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే 282పరుగులు చేయగా బంగ్లాదేశ్ 143పరుగులు మాత్రమే చేయగలిగింది.

321పరుగుల లక్ష్యంగా దిగి
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో బంగ్లా 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. 321పరుగుల లక్ష్యంగా దిగిన ప్రత్యర్థి పేలవంగా చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ఇక ఢాకా వేదికగా రెండో టెస్టు నవంబరు 11 నుంచి 15తేదీల మధ్య జరగనుంది.


Click it and Unblock the Notifications












