హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కె దంపతులు ప్రస్తుతం ఆస్ట్రేలియా హాలిడే పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం జహీర్ ఖాన్ జోడీ అడిలైడ్ ఓవల్ స్టేడియాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా అడిలైడ్లోని ఓవల్ క్రికెట్ మైదానం నిర్వాహకులు జహీర్ఖాన్ను సత్కరించారు. ఈ విషయాన్ని జహీర్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. 'మాకు ఆతిథ్యమిచ్చిన అడిలైడ్ ఓవల్కు ధన్యవాదాలు. డేవిడ్ రిడ్జ్వే, అతని ప్రియమైన భార్య మెరేడిత్ను కలవడం సంతోషంగా ఉంది. ఓవల్లో పర్యటించినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి' అని రాసుకొచ్చాడు.
ఈ క్రమంలో జహీర్ దంపతులు స్టేడియం నిర్వాహకులు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం అధికారులతో పాటు భారత్కు చెందిన ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. కాగా, జహీర్ టీమిండియా తరుపున 92 టెస్టులు, 200 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.
2013లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన జహీర్ ఖాన్ టెస్టుల్లో 311 వికెట్లు, వన్డేల్లో 282 వికెట్లు తీశాడు.