For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ఇంట్లో టీమిండియా సందడి: డిన్నర్ అదిరిందంటూ చాహల్ ట్వీట్

MS Dhoni And Sakshi Hosts The Indian Team For Dinner In Ranchi | Oneindia Telugu
Yuzvendra Chahal thanks MS Dhoni and Sakshi for dinner hosted at Ranchi residence

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో టీమిండియా సందడి చేసింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బుధవారం రాంచీకి చేరుకున్నాయి. రాంచీకి చేరుకున్న టీమిండియాను ధోని తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు.

ఇంకేముంది టీమిండియా మొత్తం ధోని ఇంటికి డిన్నర్‌కు వెళ్లింది. ఈ విందులో ధోని చక్కటి వంటకాలను జట్టులోని సహచర ఆటగాళ్లకు రుచి చూపించాడు. ధోని ఇంట్లో టీమిండియా డిన్నర్‌కు హాజరైన ఫోటోలను చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ చాహల్ ట్వీట్

మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ చాహల్ ట్వీట్

ఈ సందర్భంగా మహీ భాయ్.. సాక్షి భాబీకి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు. మూడో వన్డే కోసం ధోని రాంచీ ఎయిర్‍‌పోర్టులో దిగినప్పటి నుంచి విందుకు టీమిండియాను ఆహ్వానించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మొదటి రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించడంతో 2-0 ఆధిక్యంలో ఉంది.

మూడో వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే

మూడో వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే

రాంచీ వేదికగా శుక్రవారం జరగనున్న మూడో వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే ఐదు వన్డేల సిరిస్ టీమిండియా వశం అయినట్లే. ఇదిలా ఉంటే, మూడో వన్డేలో ధోని మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేడు వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు ధోని 33 పరుగుల దూరంలో ఉన్నాడు.

రాంచీ వన్డేలో మరో మైలురాయికి చేరువలో ధోని

రాంచీ వన్డేలో మరో మైలురాయికి చేరువలో ధోని

రాంచీ వేదికగా జరగనున్న ఈ వన్డేలో ధోని ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని ఇప్పటివరకు సాధించిన పరుగులు 16,967. ఇందులో ఆసియా ఎలెవన్‌ జట్టు తరుపున ఆడినవి కూడా ఉన్నాయి. దీంతో మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోని 16 సెంచరీలు, 106 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

వన్డేల్లో 10 సెంచరీలు చేసిన ధోని

వన్డేల్లో 10 సెంచరీలు చేసిన ధోని

ఇక, ధోని యావరేజి 45.00 గా ఉంది. భారత్ తరుపున 90 టెస్టు మ్యాచ్‌లాడిన ధోని 4,876 పరుగులు సాధించగా, 340 వన్డేల్లో 10,474 పరుగులు నమోదు చేశాడు. 98 టీ20ల్లో 1,617 పరుగుు చేశాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 71 హాఫ్‌ సెంచరీలు ఉండగా, టెస్టుల్లో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Thursday, March 7, 2019, 16:35 [IST]
Other articles published on Mar 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+