
ముంబై ఇండియన్స్ తరఫున మలింగ నాలుగు సార్లు
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్, గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన లసిత్ మలింగ మాత్రమే ఐపీఎల్లో ఈ రికార్డును సాధించాడు. చాహల్ కంటే ముందు టోర్నీలో ఈ ఫీట్ సాధించిన మలింగ తన మొత్తం ఐపీఎల్ కెరీర్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఈ శ్రీలంకన్ యార్కర్ స్పెషలిస్టు 2011, 2012, 2013, 2015 ఐపీఎల్ ఎడిషన్లలో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. ప్రస్తుతం చాహల్ మలింగ రికార్డును సమం చేశాడు.

ఆర్సీబీ తరఫున చాహల్ మూడుసార్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫు తన ఐపీఎల్ కెరీర్ను యుజ్వేంద్ర చాహల్ ప్రారంభించాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో స్థిరమైన ప్లేయర్గా చాహల్ కొనసాగాడు. అంతకుముందు 2015, 2016, 2020సీజన్లలో చాహల్ 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. తాజాగా 2022 ఐపీఎల్ ఎడిషన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న చాహల్.. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఐపీఎల్లో మొట్టమొదటి హ్యాట్రిక్ తీసుకుని సత్తాచాటాడు.

మయాంక్ అగర్వాల్ను ఆరుసార్లు బోల్తా కొట్టించాడు
దాదాపు ప్రతి మ్యాచ్లోనూ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న చాహల్ గత నాలుగు మ్యాచ్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. దీంతో అతని పర్పుల్ క్యాప్ రేసులో వెనకబడిపోతాడనుకున్న టైంలో మళ్లీ పుంజుకున్నాడు. ఇక నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లలో మిడిల్ ఓవర్లలో చాహల్ చెలరేగిపోయాడు.
ఈ లెగ్ స్పిన్నర్ పీబీకేఎస్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసి ఈ రికార్డును సాధించాడు. ఇక మయాంక్ అగర్వాల్తో తన 10ఇన్నింగ్స్లలో ఆరుసార్లు ఔట్ చేసి సత్తాచాటాడు. ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలో పంజాబ్ టాప్ స్కోరర్ బెయిర్స్టోను కూడా అవుట్ చేశాడు.

వరుసగా రెండు పరాజయాల తర్వాత
వరుసగా రెండు పరాజయాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్తో రాణించి 6వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
పంజాబ్ మాత్రం మిగిలిన మూడు మ్యాచ్లకు మూడింటిన మెరుగైన రన్రేట్తో గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 189పరుగులను చేయగా.. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులతో సునాయస విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications
