|
పాండ్యా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువీ
రహానే అవుటైన పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 223 పరుగుల వద్ద పాండ్యా కమిన్స్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో యువరాజ్ సింగ్ బ్యాటింగ్కి దిగాడు. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పాండ్యా అవుటైన తర్వాత క్రీజులోకి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అభిమానుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.
|
ఆసక్తికర సంభాషణ
ఈ ఆసక్తికర సంభాషణ ఏంటని అనుకుంటున్నారా? యువరాజ్ సింగ్ వేసుకుని వచ్చిన జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ లోగో ఉండటమే. సాధారణంగా జట్టు మేనేజ్మెంట్ ప్రతి సిరీస్ ముందు ఆటగాళ్లకు కొత్త కిట్ని అందిస్తుంది. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరిస్లు జరిగే సమయంలో ఇది తప్పనిసరి. అయితే ఇంగ్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లింది.
|
10 బంతులను ఎదుర్కొని 14 పరుగులు చేసిన యువీ
ఈ మ్యాచ్లో యువరాజ్ 10 బంతులను ఎదుర్కొని 14 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్లో హోప్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే బ్యాటింగ్కు దిగిన సమయంలో జెర్సీ తప్పుగా ధరించినట్లు గుర్తించిన యువరాజ్ ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలో ద్వైపాక్షిక సిరిస్ కోసం జట్టు మేనేజ్మెంట్ ఇచ్చిన వన్డే జెర్సీ ధరించి ఫీల్డింగ్కు వచ్చాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది.
|
105 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన అజింక్యా రహానే (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపడంతో టీమ్ఇండియా 43 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్.. భారత్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో వెస్టిండిస్పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.