
నాకు ఇప్పటికీ గుర్తుంది:
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యువరాజ్ మాట్లాడుతూ... '2004, 2006, 2008 పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడే పరిస్థితులు ఉన్నాయి. కానీ.. అది మన చేతిలో లేదు. మనందరం క్రికెట్ని ప్రేమిస్తాం. కానీ.. మన ప్రత్యర్థులు ఎవరు అనేది మనం నిర్ణయించలేం. అయితే దాయాదుల మధ్య మ్యాచ్ జరిగితే అది ఆటకి ఎంతో ఉపయోగపడుతుంది' అని చెప్పుకొచ్చాడు.

యాషెస్ కంటే పెద్ద సిరీస్:
'భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సిరీస్ ఉంటుందని అనుకుంటున్నా. సిరీస్ ఉంటే కనుక యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుంది. క్రీడా అభిమానులకు రాజకీయాలు అడ్డురాకూడదు. ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కూర్చుని మాట్లాడుకోవాలి' అని షాహిద్ అఫ్రిది అన్నాడు. భారత్-పాకిస్థాన్ 2013 నుండి ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఇక చివరిసారిగా 2008లో టెస్ట్ సిరీస్ ఆడారు.

6 బంతుల్లో 2 పరుగులు:
గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్.. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం మళ్లీ బ్యాట్ పట్టాడు. గత ఆదివారం ఆస్ట్రేలియాలో జరిగిన ఛారిటీ మ్యాచ్లో బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టిన యువీ.. బ్యాట్తో మాత్రం మెరుపుల్ని మెరిపించలేకపోయాడు. 6 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఐసీసీ టోర్నీలలో మాత్రమే:
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్ని విబేధాల కారణంగా ఇరు జట్ల మధ్య గత కొంతకాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. భారత్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీసీసీఐ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఈ నేపథ్యంలో కొందరు మాజీలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్ జరిగాలని అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో యువరాజ్ కూడా చేరిపోయాడు.


Click it and Unblock the Notifications












