For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: న్యూజిలాండ్​దే పైచేయి.. టీమిండియాకు అది ఖచ్చితంగా ప్రతికూలతే: యువరాజ్‌

Yuvraj Singh says Team India will have a slight disadvantage in WTC Final
WTC Final: IPL 2021 - Team India Disadvantage Says Yuvraj Singh | Oneindia Telugu

ముంబై: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)​కు ముందు ఇంగ్లండ్​తో సిరీస్​ ఆడటం న్యూజిలాండ్​కు కలిసొచ్చే అంశమని భారత మాజీ ఆల్‌రౌండర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ 2021 ఆడి నేరుగా టెస్టు క్రికెట్‌ ఆడాలంటే కాస్త కష్టమని సందేహం వెలిబుచ్చాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కోహ్లీసేనకు ఖచ్చితంగా ప్రతికూలతే అని పేర్కొన్నాడు. ఫైనల్స్‌లో భారత్ విజయం సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఛాంపియన్‌షిప్‌ ఆలోచన మంచిదని, దాంతో టెస్టు క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లొచ్చని యువీ పేర్కొన్నాడు.

భారత్‌ గెలవాలని కోరుకుంటున్నా

భారత్‌ గెలవాలని కోరుకుంటున్నా

తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన యువరాజ్‌ సింగ్‌ ఫైనల్స్‌లో భారత్ గెలవాలని ఉన్నా.. న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ అనుకూలత ఉందన్నాడు. 'టెస్టు క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లడం మంచి ఆలోచన. భారత్ బలంగా ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇటీవలి కాలంలో కోహ్లీసేన విదేశాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ఎక్కడైనా విజయం సాధిస్తామనే ధీమా ఆటగాళ్లలో నెలకొంది. అయితే, ఇంగ్లండ్‌లోని పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. మరోవైపు డ్యూక్‌బాల్‌ కూడా ప్రభావం చూపిస్తాయి. ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం దొరకడంతో భారత్‌ గెలవాలని కోరుకుంటున్నా' అని యువీ అన్నాడు

మూడు టెస్టులు ఉండుంటే బాగుండేది:

మూడు టెస్టులు ఉండుంటే బాగుండేది:

'భారత్ బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. బౌలింగ్‌ పరంగా ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి. అయితే భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ 2021 ఆడి నేరుగా టెస్టు క్రికెట్‌ ఆడాలంటే కాస్త కష్టమే. పరిస్థితులకు బాగా అలవాటు పడితేనే అక్కడి పిచ్‌లను అర్థం చేసుకునే వీలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ నేరుగా టెస్టు క్రికెట్‌ ఆడటం అంత తేలిక కాదు.

ఇంగ్లండ్‌తో కివీస్ రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి. కోహ్లీసేనకు ఇది కొంచెం ప్రతికూలాంశం. మ్యాచ్​కు ముందు 8-10 ప్రాక్టీస్ సెషన్లు ఉన్నాయి. అయితే మ్యాచ్ ప్రాక్టీస్​కు ఇవి ప్రత్యామ్నాయం కాలేవు' అని యువీ పేర్కొన్నాడు. ఫైనల్​లో మూడు టెస్టులు ఉండుంటే బాగుండేదని, ఎందుకంటే ఒక మ్యాచ్​లో ఓడినా తర్వాత రెండింటిలో పుంజుకుని ఆడొచ్చని మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు.

ఓపెనింగ్ జోడీ డ్యూక్​ బంతికి త్వరగా అలవాటు పడాలి

ఓపెనింగ్ జోడీ డ్యూక్​ బంతికి త్వరగా అలవాటు పడాలి

ఇంగ్లండ్​లో తొలిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ, శుభమన్​ గిల్ జోడీ డ్యూక్​ బంతికి త్వరగా అలవాటు పడాలని యువీ అన్నాడు. 'రోహిత్​ శర్మ టెస్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఇప్పటికే ఏడు సెంచరీలు చేశాడు. ఓపెనర్​గా నాలుగు శతకాలు బాదాడు. కానీ రోహిత్​, గిల్​ కలిసి గతంలో ఇంగ్లండ్​లో ఓపెనర్లుగా దిగలేదు. అక్కడ డ్యూక్​ బంతి త్వరగా స్వింగ్​ అవుతుంది. వారికి ఇది సవాల్​ లాంటిది.

కాబట్టి పరిస్థితులకు త్వరగా అలవాటుపడాలి' అని యువరాజ్ సూచించాడు. గిల్​ తన అరంగేట్ర సిరీస్​ ఆస్ట్రేలియాలో చేసిన అద్భుత ప్రదర్శనను గుర్తుచేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నాడు. ఆత్మివిశ్వాసం రెట్టింపు అయితే ప్రపంచంలో ఎక్కడైనా బాగా ఆడగలడని అన్నాడు.

Story first published: Monday, June 7, 2021, 13:18 [IST]
Other articles published on Jun 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+