
నీతా అంబానీ సైతం
రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీతో పాటు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బాలీవుడ్ నుంచి ఫర్హాన్ అక్తర్, రవీనా టాండన్, సాగరిక ఘట్కే తదితరులు హాజరయ్యారు. ఈ పార్టీకి హాజరైన వారంతగా చాలా సరదాగా సందడి చేశారు. భారత్ తరుపున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు.

304 మ్యాచ్లాడిన యువీ
ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 304 మ్యాచ్లాడి 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్లాడిన యువీ 8 ఆఫ్ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు.

మిడిలార్డర్ బ్యాట్స్మన్గా
కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్గా, ఆల్రౌండర్గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్ 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం విదేశీ లీగ్ల్లో ఆడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని యువరాజ్ బీసీసీఐని కోరాడు.

గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్లో
ఇందులో భాగంగా కెనడా వేదికగా త్వరలో ఆరంభం కాబోతున్న గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ ఆడబోతున్నాడు. టోరంటో నేషనల్స్ జట్టుకు అతను ఎంపిక అయ్యాడు. జులై 25వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే క్రికెట్ను ప్రోత్సహించడానికి గ్లోబల్ టీ20 కెనడాను నిర్వహిస్తున్నారు.

టోరంటో నేషనల్స్ తరఫున
ఈ టోర్నమెంట్లో టోరంటో నేషనల్స్ తరఫున ఆల్రౌండర్ కేటగిరీలో యువరాజ్ సింగ్ను తీసుకుంది జట్టు మేనేజ్మెంట్. దీంతో పాటు మరో టీ20 టోర్నమెంట్కు కూడా యువరాజ్ సింగ్ ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరో టీ20 స్లామ్ టోర్నమెంట్లో కూడా యువరాజ్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది


Click it and Unblock the Notifications












