అనుమతి ఇస్తాం:
'విదేశీ టీ20 లీగ్ విషయమై యువరాజ్ బోర్డును అనుమతి కోరుతూ ఇంకా లేఖ రాయలేదు. లేఖ అందిన వెంటనే దానిని పరిశీలిస్తాం. యువీ ఐపీఎల్ ఆడటం లేదు కాబట్టి విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించేందుకు అవకాశాలు తక్కువ. యువీ లాంటి మాజీ క్రికెటర్లు విదేశాల్లో ఆడేందుకు అనుమతి ఇస్తాం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
సమస్యేమీ లేదు:
'రిటైర్మెంట్ తర్వాత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విదేశీ క్రికెట్ ఆడుతున్నప్పుడు.. యువరాజ్ కూడా ఆడతానంటే సమస్యేమీ లేదు. యువీ ఇప్పుడు రిటైర్ అయ్యాడు. అతను 2007, 2001 ప్రపంచకప్లలో అద్భుత ప్రదర్శన చేసాడు. భారత క్రికెట్కు ఎంతో సేవ చేశాడు. అతనికెప్పుడూ గౌరవం ఉంటుంది' అని మరో అధికారి పేర్కొన్నారు.
విదేశీ టీ20ల్లో:
రిటైర్మెంట్ అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు విదేశీ టీ20ల్లో ఆడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ టీ10 క్రికెట్ ఆడుతున్నారు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ కూడా విదేశీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అనుమతి కోరాడు. అయితే బోర్డు పరిధిలో క్రికెట్ ఆడుతున్న వారికి బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. యువరాజ్ సింగ్కు బీసీసీఐ అనుమతి ఇస్తే.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్, ఐర్లండ్లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడు.
2017లో చివరి వన్డే, టీ20:
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ (37) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో పాటు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికాడు. బీసీసీఐతో చర్చలు జరిపిన అనంతరం సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి యువరాజ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువీ.. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు.
304 వన్డేలు.. 8701 పరుగులు
యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.