
హైదరాబాద్ : టీ 20ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పర్యటనకై భారత్ వచ్చిన జాంటీ రోడ్స్ యువరాజ్ సింగ్ సిక్సర్ల వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టేశాడు. సోమవారం ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించిన రోడ్స్ కశ్మీర్ అందాలను తిలకించేందుకు దిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్తున్నట్లు తెలిపాడు.
ఈ క్రమంలో పర్యటనలో భాగంగా జైపూర్ను సందర్శించాడు. అక్కడ లస్సీ తాగుతున్న ఓ ఫొటోను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ లస్సీ చాలా బాగుంటుందని దీనిని 1944నుంచి ఇదే దుకాణంలో తాగుతున్నానని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇది ఇక్కడ ఎంతో ఫేమస్. దీనిని తాగే యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది ఉంటాడని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.