
రూ.2 కోట్ల కనీస ధరలో
బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. ఈ మొత్తంలో ఉన్న 9 మంది ప్లేయర్లు (బ్రెండన్ మెకల్లమ్, వోక్స్, లసిత్ మలింగ, షాన్ మార్ష్, కొలిన్ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, శ్యామ్ కరన్, డార్సీ షార్ట్) విదేశీయులే.
గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం
ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. గత సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్సింగ్ను అతని పేలవప్రదర్శన కారణంగా ఆ జట్టు విడుదల చేసింది.
యువీకి ఎంతో కీలకం కానున్న ఐపీఎల్ 2019 సీజన్
దీంతో ఐపీఎల్ 2019 వేలం టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్కు కీలకం కానుంది. గతేడాదిన్నర కాలంగా జాతీయ జట్టుకు దూరమైన యువీ తనను తాను నిరూపించుకోవాలంటే ఏదో ఒక ప్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయాల్సిందే. ఈ ఐపీఎల్లో యువీ మెరుపులు మెరుపించకుంటే క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడినట్లే.
కనీస్ ధరను రూ. కోటికి తగ్గించుకున్న యువరాజ్
ఈ ఐపీఎల్లో తనను ఏదో ఒక ప్రాంఛైజీ కొనుగోలు చేయాలనే భావనతో ధర సైతం రూ.2 కోట్ల నుంచి కోటికి తగ్గించుకున్నాడు. ఫిట్నెస్ పెంచుకున్నాడు. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు యువరాజ్ను తీసుకోవాలని ఆ ప్రాంచైజీని పట్టుబడుతున్నారు.
చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్లో ఓటింగ్
తాజాగా చెన్నై ఫ్రాంచైజీ "ఈ సమ్మర్లో మనజట్టులో కొత్తగా ఎవరిని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి" అని అధికారిక ట్వీటర్ పేజీలో ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్లో చెన్నై అభిమానులు తమకు యువరాజే కావాలంటూ ఓటేశారు. యువీని తీసుకోవాలని.. మళ్లీ యువరాజ్-ధోని కాంబో చూడముచ్చటగా ఉంటుందని ట్వీట్ చేశారు.
యువీకే ఓటేసిన చెన్నై అభిమానులు
గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమైన యువరాజ్.. గత సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయినా సరే చెన్నై అభిమానులు మాత్రం యువరాజే కావాలంటూ పట్టుబడుతుండటం విశేషం. వచ్చే ఏడాది మార్చి 29న సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్తో ఐపీఎల్ 2019 సీజన్కు తెరలేవనుంది.


Click it and Unblock the Notifications












