హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీ సేన వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా ఆ తర్వాత జరిగిన రెండు, మూడు వన్డేల్లో టీమిండియా విజయం సాధించగా, ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండిస్ విజయం సాధించింది.
దీంతో ఐదు వన్డేల సిరిస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే జులై 6న జమైకాలోని కింగ్స్టన్ మైదానంలో జరగనుంది. ఇదిలా ఉంటే వెస్టిండిస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కాస్తంత విరామం దొరికితే స్ధానిక ప్రదేశాలను చూడటంతో పాటు బీచ్, స్మిమ్మింగ్ పూల్స్లో సందడి చేస్తున్న వైనాన్ని మనం చూశాం.
మరికొందరు ఆటగాళ్లు విండిస్ జట్టులో ఉన్న ఆటగాళ్ల ఇంటికి సైతం వెళుతున్నారు. సిరిస్లో భాగంగా రెండో వన్డే ముగిసిన అనంతరం భారత క్రికెటర్లు డ్వేన్ బ్రావో ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమానికి సైతం హాజరయ్యారు. ఈ విందు కార్యక్రమంలో బ్రావో ఆటగాళ్లకు స్థానిక వంటకాలను రుచి చూపించాడు.
టీమిండియాలోని పలువురి ఆటగాళ్లతో బ్రావోకి మంచి స్నేహాం ఉంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని ఐపీఎల్ జట్టులో బ్రావో ఆడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వెస్టిండిస్ ఆటగాడు డారెన్ బ్రావో భారత జట్టు వెటరన్ క్రికెటర్ యువీని కలిశాడు.
ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ ఒక బ్యాట్ను బ్రావోకి గిఫ్ట్గా అందించాడు. ప్రస్తుతం భారత్తో జరుగుతున్న వెస్టిండిస్ జట్టులో డారెన్ బ్రావోకి చోటు దక్కలేదు.
ఇదిలా ఉంటే జులై 6న జరిగే ఆఖరి వన్డేలో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తుండగా, మరో పక్క విండీస్ ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కోహ్లీసేనకు చావో రేవో మాదిరి తయారైంది.