న్యూ ఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ని కార్టూన్తో పోలుస్తూ వెటరన్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా ఆటపట్టించాడు. సుదీర్ఘకాలంగా ఆప్త మిత్రుల్లా కొనసాగుతున్న ఈ జోడీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కలిసి ఆడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం యువరాజ్ సింగ్ భారత జట్టుకి దూరమై దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు.
వెస్టిండీస్ జట్టుకి దూరంగా ఉంటున్న క్రిస్గేల్ ఇప్పుడు దుబాయ్ వేదికగా జరుగుతున్న అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. తాజాగా ముంబైలోని ఓ సినిమా థియేటర్కి వెళ్లిన యువరాజ్ సింగ్.. అక్కడ ప్రచారంలో భాగంగా ఉంచిన హాలివుడ్ సినిమాలోని సైన్స్ ఫిక్సన్ క్వారెక్టర్తో ఫొటో దిగాడు. అనంతరం దాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ఆ క్యారెక్టర్ని క్రిస్గేల్తో పోల్చాడు.
View this post on InstagramKaka!!! what are you doing in mumbai ? I thought you were in Dubai 🤔🤪😈 @chrisgayle333
A post shared by Yuvraj Singh (@yuvisofficial) on
'కాకా.. నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు..? నువ్వు దుబాయ్లో ఉన్నావు అనుకుంటున్నా' అని రాసుకొచ్చాడు. అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్లో క్రిస్గేల్ వరుస హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. చివరిగా ముగిసిన మూడు మ్యాచ్ల్లోనూ అతను 53, 73, 80 పరుగులతో సత్తాచాటాడు. టెస్టు సిరీస్ అనంతరం జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్కు క్రిస్ గేల్ లాంటి ప్లేయర్లు ఉంటే జట్టుకు మంచి బలం చేకూరుతుందని ఆ దేశ సీనియర్ క్రికెటర్లు చెప్పుకొస్తున్నారు.
మరోవైపు యువరాజ్ సింగ్ కూడా ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో 264 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుకానుండగా.. ఈ సిరీస్కి క్రిస్గేల్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.