జైపూర్: భారత బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ కు మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామా జరిమానా విధించారు. యువరాజ్ కు మ్యాచు ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. జైపూర్ లో పాకిస్తానుతో జరిగిన ఐదో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు ఈ జరిమానా విధించారు. ఐదో వన్డేలో అంపైర్ సురేష్ శాస్త్రి అవుట్ ఇచ్చిన తర్వాత కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ యువరాజ్ సింగ్ కొద్ది సేపు క్రీజ్ లో అలాగే నిలబడ్డాడు. పాక్ బౌలర్ ఉమర్ గుల్ బౌలింగులో యువరాజ్ అవుటైనట్లు అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే కీపర్ చేతిలోకి వెళ్లిన బంతి బ్యాట్ కు తగులలేదన్నట్లు యువరాజ్ అలాగే నించున్నాడు. యువరాజ్ అవుట్ కావడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది. పాకిస్తాన్ విజయానికి యువరాజ్ అవుట్ పాదులు వేసింది.