
హైదరాబాద్: అటు అభిమానుల నుంచి ఇటు మీడియా వరకు ఎవ్వరికీ అందకుండా సుదూర ప్రయాణం చేసి విదేశాల్లో ఒక్కటైన ప్రేమజంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఇటలీలో వివాహం అనంతరం అటునుంచి అటే హనీమూన్కు రోమ్కు చెక్కేశారు. తిరిగి రెండ్రోజులు ముందే ఢిల్లీలోని తన స్వగృహానికి శ్రీమతిని తీసుకుని వచ్చిన విరాట్ రిసెప్షన్ ఏర్పాట్లు చూసుకున్నాడు.
రిసెప్షన్ వేడుకను హోటల్ తాజ్ ప్యాలస్లో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా చేసిన ఏర్పాట్లకు ప్రధానితో సహా బంధు మిత్రులు సైతం ఆశ్చర్యానికి గురైయ్యారు. వేడుకలో కోహ్లీ, అనుష్కలు సంప్రదాయ దుస్తుల్లో హాజరైయ్యారు. వారి వేషాధారణే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
అంతా బాగానే జరిగింది. కానీ, ట్విట్టర్లో మాత్రం ఈ వేడుకపై జోకులు పేలుతున్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే కోహ్లీ, అనుష్క హనీమూన్ ఫొటోలను బ్యాక్గ్రౌండ్ మార్చి పోస్ట్ చేసిన దానికంటే హాస్యాస్పదంగా ఉన్నాయి.
ఆ వ్యంగ్యోక్తమైన ట్వీట్లు ఇవిగో..
వాళ్లు ఇన్విటేషన్ కార్డు పంపకపోతే వాళ్ల పెళ్లిని రేపే కాన్సిల్ చేస్తానంటూ అరవింద్ కేజ్రీవాల్ ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు.
కోహ్లీ వివాహ వేడుకలో క్రికెట్ మాజీ ఆటగాళ్లు సైతం భోజనం చేస్తున్నట్లు..
అబ్బో.. ప్రస్తుత ఆటగాళ్లు కూడా లాగించేస్తున్నారు. కానీ, ధోనీ ఆల్రెడీ తినేశాడంట..
వివాహ విందు వేదిక ఎక్కడో తెలియక తికమక పడుతున్న విజయమాల్యా...
ప్రధాని మోడీని వెతుకుతున్నారా.. ఇక్కడున్నారు.
మాన్యవర్ బట్టల యాడ్ ఇస్తున్నారా.. కన్ప్యూజ్ చేయకండి
విరుష్కాల పెళ్లిని ఆధార్తో లింక్ చేయడానికి స్వయంగా ప్రధాని వచ్చారు.
టెస్టు మ్యాచ్లో ఢిల్లీ వాతావరణాన్ని గుర్తు చేస్తూ..
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.