రెండేళ్ల పాటు పొడిగింపు
దీంతో రవిశాస్త్రికి హెడ్ కోచ్గా రెండేళ్ల పాటు పొడిగింపు లభించింది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన తరువాత అప్పట్లో రవిశాస్త్రి పదవి ఊడిపోతుందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెట్టారు. దీనిపై తాజాగా గంగూలీ స్పందించాడు.
అవి ఊహాగానాలు
"అందుకే అవి ఊహాగానాలు. దీనికి నా దగ్గర సమాధానం లేదు. ఇది చాలా సులభం. ఇది పనితీరుకు సంబంధించిన విషయం. మీరు మంచి ప్రదర్శన చేశారనుకుంటే కొనసాగించబడతారు లేకపోతే మరొకరు మన స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదొక సింపుల్ ఫార్ములా" సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
2021లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు
రెండోసారి హెడ్ కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి 2021లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకూ ఆ పదవిలో ఉంటాడు. రెండోసారి కోచ్గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచింది. రవిశాస్త్రికి ప్రస్తుతం ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది.
రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా ఉంది
తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల మేర పెరిగింది. వన్డే ప్రపంచకప్ ఓటమి నేపథ్యంలో రవిశాస్త్రిపై వేటు పడుతుందని అంతా ఊహించారు. కానీ.. బీసీసీఐ మళ్లీ అతడికే పట్టం కట్టింది. భారత క్రికెట్ జట్టుతో రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా ఉంది.
360 పాయింట్లతో అగ్రస్థానంలో టీమిండియా
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాను అధిగమించి స్వదేశంలో వరుసగా 12 టెస్ట్ సిరీస్లను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి సిరీస్లను నెగ్గింది. అంతకుముందు వెస్టిండీస్ను 2-0తో ఓడించింది.