అనుమతి తీసుకోవాల్సిందే
"తప్పకుండా అనుమతి తీసుకోవాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే కొనసాగుతాయి. అందుకే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు. చివరగా ఈ రెండు దేశాలు 2012లో రెండు టీ20లు, 3 వన్డేల సిరిస్లో తలపడ్డాయి.
అక్టోబర్ 23న బాధ్యలు
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యలు చేపట్టనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సోమవారం దాదా తన నామినేషన్ పత్రాలను సమర్పించి సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే.
సెప్టెంబర్ 2020 వరకు పదవిలో
అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 2020 వరకు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత గంగూలీ నేతృత్వంలోనే టీమిండియా 2004లో పాక్లో చారిత్రక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
వరల్డ్కప్ నుంచి పాక్ను నిషేధించాలి
ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పుల్వామా ఉగ్రదాడితో ఇటీవలే ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్కప్ నుంచి పాక్ను ఐసీసీ బ్యాన్ చేయాలని సీఓఏ కోరిన సంగతి తెలిసిందే.