బట్లర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్
ఓపెనర్ జోస్ బట్లర్(5) ఔటవగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ ఐపీఎల్ 2019 సీజన్లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగాడు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్రైజర్స్ అగ్రశ్రేణి బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఒకే ఓవర్లో వరుసగా 6, 4, 4, 2, 4, 4 బాదేశాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 76 పరుగుల్ని రాబట్టగలిగింది.
సన్రైజర్స్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్
సన్రైజర్స్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు ధీమాతో ఉంది. అయితే, చేధనలో సన్రైజర్స్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 69), బెయిర్ స్టో(45) విజృంభించడంతో సంజు శాంసన్ సెంచరీ వృథా అయింది. మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్... సంజూ శాంసన్ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.
|
నాదైన రోజును నువ్వు నాశనం చేశావు
ఈ ఇంటర్యూలో సంజూ శాంసన్ "నాదైన రోజును నువ్వు నాశనం చేశావు డేవిడ్. నీ బ్యాటింగ్ ముందు నా సెంచరీ పనికిరాకుండా పోయింది. మీ ఇన్నింగ్స్ మొదలెట్టగానే పవర్ప్లేలోనే మ్యాచ్ మా నుంచి చేజారిపోయింది. అయినా ప్రత్యర్థులుగా సన్రైజర్స్ వంటి పటిష్ట జట్టు ఉన్నపుడు మేము కనీసం 250 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచాల్సింది. అయినా నాకు ఇదొక ప్రత్యేకమైన రోజు" అని అన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 53 సెంచరీలు నమోదు కాగా సంజూ శాంసన్కిది రెండో సెంచరీ కావడం విశేషం.