హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోమవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టును పల్టీలు కొట్టించింది. అద్భుతమైన ప్రదర్శన చేసి కేవలం 88పరుగులకే కట్టడి చేసింది. ప్లేఆఫ్ ఆశలు ఆవిరి అయిపోతున్న తరుణంలో బెంగళూరు జట్టుకు ఊపిరిపోసినట్లైంది. అయితే ఈ మ్యాచ్కు ముందు బెంగళూరు ఆటగాళ్లకు ఉత్సాహాన్నిస్తూ ఆ జట్టు కెప్టెన్ సతీమణి అయిన అనుష్క శర్మ విరాట్ జెర్సీ నంబర్ ఉన్న జెర్సీ ధరించి ఓ ట్వీట్ చేసింది. కమాన్ బాయ్స్ ఆడి గెలవండి. అంటూ పేర్కొంది.
Come on boys❤️🏏🎈 pic.twitter.com/XZi8WnkoMH
— Anushka Sharma (@AnushkaSharma) May 14, 2018
ఆమె ట్వీట్కు తగ్గ న్యాయం చేసిన బెంగళూరు జట్టు అద్వితీయమైన విజయాన్ని అందుకున్నారు. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఆ ట్వీట్కు బదులిస్తూ 'ఎస్ మై లవ్' మేమిప్పుడే ముగించాం అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు స్పందించిన అభిమానులు వరుస ట్వీట్లు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Yes my love. Indeed we arrived today 😃❤
— Virat Kohli (@imVkohli) May 14, 2018
ఐపీఎల్ 11వ సీజన్లో ప్రతి మ్యాచ్ను వీక్షిస్తున్న అనుష్క శర్మ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అయితే డూ ఆర్ డై అనే స్థాయిలో సాగిన మ్యాచ్కు మాత్రం రాలేకపోయారు. అయినా ఆమె ఆటగాళ్లకు సందేశమందేలా ఇలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె షారూక్ ఖాన్తో జరుగుతోన్న సినిమా జీరో షూటింగ్లో బిజీగా ఉన్నారు.
సోమవారం హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు కేవలం 88పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ కాస్త తడబడి రాణిస్తున్నారు అనుకునే లోపే వరుస మూడు బంతుల్లో అవుట్ అయి పెవిలియన్ చేరుకున్నారు.
చేధనలో బెంగళూరు ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ, పార్థివ్ పటేల్ మ్యాచ్ను ముగించారు. కోహ్లీ(48)కు పార్థివ్ పటేల్(40)పరుగులు జోడించడంతో విజయతో ముగించారు. బెంగళూరు జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. కాగా, పంజాబ్ జట్టుకు వరుసగా మూడో ఓటమి. బెంగళూరు తదుపరి మ్యాచ్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది.