For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీ తర్వాత యశస్వి సంచలన వ్యాఖ్యలు.. గిల్ గురించి అసలు నిజం చెప్పేశాడు!

IND vs ENG: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతోన్న లీడ్స్ టెస్ట్ మొదటి రోజు టీమిండియా తరఫున యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీలు సాధించారు. ఆట ముగిసిన తర్వాత యశస్వి జైస్వాల్ తన సెంచరీ విజయ రహస్యాన్ని వెల్లడిస్తూ కెప్టెన్ గిల్ గురించి గొప్ప మాటలు చెప్పాడు. మొదటి రోజు టీమిండియా 359 పరుగులు చేసింది.

సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ ఏమన్నాడంటే?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజు టీమిండియా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. దీంతో రెండు సెంచరీలు నమోదయ్యాయి. తొలుత యశస్వి జైస్వాల్, ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీలు సాధించి ఇంగ్లాండ్ జట్టును వెనక్కి నెట్టారు. ఇంగ్లాండ్ గడ్డపై యశస్వి జైస్వాల్‌కు ఇది తొలి టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత యశస్వి జైస్వాల్ తన సెంచరీ విజయ రహస్యాన్ని బయటపెట్టాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గురించి కూడా వ్యాఖ్యానించాడు.

Yashasvi Jaiswal s Sensational Remarks After Century Reveals Truth About Gill

లీడ్స్ టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత యశస్వి జైస్వాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "క్రికెట్‌లో ఎల్లప్పుడూ సవాళ్లు ఉంటాయి. అవి వివిధ దశలలో విభిన్నంగా ఉంటాయి. ప్రత్యేక పరిస్థితులలో ఎలా ఆడాలి, మైదానం ఎలా ఉంది, వారు ఎక్కడ బౌలింగ్ చేస్తున్నారు. జట్టుకు ఏమి అవసరం అనే దానిని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను" అని యశస్వి జైస్వాల్ అన్నాడు. సెంచరీకి ముందు యశస్వి జైస్వాల్ చేతికి బంతి తగిలింది. దాని కారణంగా జైస్వాల్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో మైదానంలోకి వచ్చి జైస్వాల్ చేతికి చాలా సార్లు మసాజ్ చేసినా, యశస్వి జైస్వాల్ ధైర్యం కోల్పోకుండా సెంచరీ సాధించాడు.

అదే సమయంలో శుభ్‌మన్ గిల్ గురించి యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. "మేము మైదానంలో చాలా మాట్లాడాము. సెషన్ బై సెషన్ ఆడటం , సరైన బంతిని సద్వినియోగం చేసుకోవడం గురించి చర్చించాం. మా మధ్య అద్భుతమైన స్నేహం ఉంది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతంగా ఉంది. గిల్ ప్రశాంతంగా, సంయమనంతో ఉన్నాడు." అని జైస్వాల్ చెప్పాడు.

శుభ్‌మన్ గిల్-యశస్వి జైస్వాల్ మధ్య 129 పరుగుల భాగస్వామ్యం
కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఔటైన తర్వాత యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టి ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. వీరిద్దరి మధ్య 129 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ సమయంలో యశస్వి జైస్వాల్ 159 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మొదటి రోజు 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది.

Story first published: Saturday, June 21, 2025, 11:14 [IST]
Other articles published on Jun 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+