Yashasvi Jaiswal: భారత జట్టులో సంచలన ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఓపెనర్గా దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంటాడు. అయితే ఈ భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కీలక నిర్ణయం తీసకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో తన స్టేట్ టీమ్ నుంచి మారాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోరుతూ లేఖ రాశాడు.
ఆ జట్టుకు కెప్టెన్ గా..
"మా నుంచి అతడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోరాడు. గోవాకు మారాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇది అతడి వ్యక్తిగత నిర్ణయం." అని ఎమ్సీఏ తెలిపింది. అలానే జైశ్వాల్ కు దగ్గరగా ఉన్న ఓ ప్రతినిధి కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కాగా, 2025-26 సీజన్ లో జైశ్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని సమాచారం అందింది.

4,26 పరుగులు..
టీమిండియా క్రికెటర్లందరూ అంతర్జాతీయ మ్యాచులు లేని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత సీజన్ లో ముంబయి జట్టు తరఫున ఆడిన జైశ్వాల్.. రంజీ ట్రోఫీలో జుమ్ము కశ్మీర్ తో జరిగిన మ్యాచులో ఆడాడు. ఆ మ్యాచులో 4,26 పరుగులు చేశాడు.
ముంబయితో యశస్వి జైశ్వాల్ జర్నీ..
17ఏళ్ల వయసులో ముంబయి జట్టులోకి వచ్చిడా యశస్వి. 2018-19 సీజన్ లో ముంబయి జట్టు తరఫున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. 2022 సీజన్లో కేవలం మూడు మ్యాచుల్లోనే 83 సగటుతో 498 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 181. ఆ సీజన్ లో ముంబయి ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర కూడా పోషించాడు. 2019-20లో విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి మంచి ప్లేయర్ గా పేరు గాంచాడు. టెస్టుల్లోనూ సూపర్ ఓపెనర్గా అవతరించాడు.