
టెస్ట్ మ్యాచే అయినప్పటికీ.. హైఓల్టేజ్
అటు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం కసరత్తు పూర్తి చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను ఓడించి.. మొట్టమొదటి డబ్ల్యూటీసీ చాంపియన్షిప్గా ఆవిర్భవించాలని ఉవ్విళ్లూరుతోంది. టెస్ట్ క్రికెట్టే అయినప్పటికీ- అందరి కళ్లూ ఆ మ్యాచ్ మీదే నిలవడానికి కారణం.. ఈ ఫార్మట్లో తొలిసారిగా ఛాంపియన్షిప్ను ఏర్పాటు చేయడమే. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా ఉన్న అన్ని జట్లూ ఇందులో పాల్గొన్నాయి. అత్యధిక పాయింట్లను టీమిండియా, కివీస్ జట్లు ఫైనల్కు చేరాయి.

టీమిండియా ఖాతాలో..
భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్లను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా కోహ్లీసేన ఈ ఫైనల్లో అడుగు పెట్టింది. భారత జట్టు ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచి, ఫైనల్కు అర్హత పొందింది. ఈ మ్యాచ్ను ప్రసారం చేసే హక్కులను స్టార్ నెట్వర్క్ పొందింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అఫీషియల్ బ్రాడ్కాస్ట్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్ దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది.

ఏడు ఛానళ్లలో
స్టార్ నెట్వర్క్ గ్రూప్లోని ఏడు వేర్వేరు ఛానళ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. అయిదు భాషల్లో కామెంటరీని వినొచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మూడు ప్రాంతీయ భాషలు తెలుగు, తమిళం, కన్నడల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కామెంటరీని వినొచ్చు. ఆయా ప్రాంతీయ భాషల్లో స్టార్ నెట్వర్క్ ఛానళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది భాషలనే ఎంచుకుందా స్పోర్ట్స్ నెట్వర్క్ గ్రూప్ యాజమాన్యం.

ఇంగ్లాండ్లో మరో మూడురోజుల క్వారంటైన్
ఇంగ్లాండ్ విమానం ఎక్కబోతోన్న నేపథ్యంలో వారంతా దశలవారీగా బయో బబుల్లోకి వెళ్లారు. కేప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉంటోన్నారు. ఇంగ్లాండ్లో దిగిన తరువాత అక్కడ కూడా మూడు రోజుల పాటు టీమ్, సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది. బ్రిటన్ నిబంధనల ప్రకారం.. మూడు రోజుల పాటు క్వారంటైన్ తప్పదు.


Click it and Unblock the Notifications












