
రెండు నెలల పాటు బ్యాట్ పట్టుకోకూడదు
"ఆపరేషన్ అనంతరం సాహా సుమారు రెండు నెలల పాటు బ్యాట్ పట్టుకోకూడదు. అప్పుడే అతను పూర్తిగా కోలుకోగలడు. దీంతో అతడు నవంబరులో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే దానిపై కూడా అనుమానాలు నెలకొన్నాయి" అని అతడు చెప్పుకొచ్చాడు.

భుజం గాయం కారణంగా భారత్కు తిరిగొచ్చిన సాహా
"ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ జరిగే సమయంలో భుజం గాయం కారణంగా సాహా తిరిగి ఇండియా వచ్చేశాడు. ఆ తర్వాత కోలుకుని ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ సమయంలో సాహా చేతి వేలికి గాయంతో ఐపీఎల్ లీగ్కే పూర్తిగా దూరమయ్యాడు" అని తెలిపాడు.

భుజం గాయంతో బాధపడుతోన్న సాహా
"కానీ, ఇప్పుడు సాహా చేతి వేలి గాయం కంటే ఎక్కువగా భుజం గాయంతో బాధపడుతున్నాడు. దీని నుంచి కోలుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు" అని బీసీసీఐ అధికారి తెలిపాడు. మరోవైపు సాహా ట్విటర్ ద్వారా తన గాయంపై అభిమానులతో పంచుకున్నాడు.
ప్రస్తుతం అత్యంత చెత్త దశను ఎదుర్కొంటున్నా
"అవును. వృద్ధి ఆరోగ్యంగా లేడు. అందుకే ఇంగ్లాండ్తో సిరీస్కు దూరమవ్వాల్సి వచ్చింది. నా క్రికెట్ కెరీర్లో ప్రస్తుతం అత్యంత చెత్త దశను ఎదుర్కొంటున్నాను. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. గాయమవ్వడం మన చేతిలో లేదు. నా క్రికెట్ భవిష్యత్తు గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాకండి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించండి. దేశం తరఫున ఆడుతోన్న ఆటగాళ్లకు మద్దతుగా నిలవండి" అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications












