ఎడతెరిపి లేని వర్షం కురువడంతో
అనంతరం ఎడతెరిపి లేని వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి వెస్టిండిస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్(4) పరుగులకే పెవిలియన్కు చేరాడు. గేల్ను కుల్దీప్ ఔట్ చేశాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ ఇలా
క్రీజులో ఎవిన్ లెవిస్(40), షైహోప్(6) పరుగులతో ఉన్నారు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం స్పందించాడు. కోహ్లీ మాట్లాడుతూ "మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాటిమాటికి వర్షం అంతరాయం కలిగించడం చిరాకు తెప్పిస్తుంది. ఆట జరిగేటప్పుడు పూర్తిగా వర్షమైనా పడాలి లేదా పూర్తి ఆటైనా కొనసాగాలి" అని అన్నాడు.

ఇలా దోబూచులాడితే
"ఇలా దోబూచులాడితే ఇబ్బందిగా ఉంటుంది. ఇక. క్రికెట్లో అనూహ్య మార్పులొచ్చాయి. అందుకు ఇంగ్లాండ్ ప్రదర్శనే నిదర్శం. టీ20ల ప్రభావంతో వన్డేల్లో 400 స్కోర్లు సునాయాసంగా కొట్టగలుగుతున్నారు. ఆటగాళ్లు ఫిట్గా ఉండి అద్భుతంగా ఆడుతున్నారు" అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
పేస్, బౌన్సింగ్కు అనుకూలిస్తాయి
"కరీబియన్ దీవుల్లో కొన్ని స్టేడియాలు ఆటగాళ్లను పరీక్షిస్తాయి. మరికొన్ని స్టేడియాలు పేస్, బౌన్సింగ్కు అనుకూలిస్తాయి. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడిన జట్టే విజయాలు సాధిస్తుంది. రాబోయే మ్యాచ్ల్లో రెండు జట్లూ పోటాపోటీగా తలపడతాయి" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












