
హైదరాబాద్: వెస్టిండీస్ కరీబియన్ దీవుల్లో హరికేన్స్ బీభత్సం కారణంగా పాడైన స్టేడియాల మరమ్మతుల కోసం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ను గురువారం ఐసీసీ నిర్వహించింది. వెస్టిండీస్ vs వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ఛారిటీ మ్యాచ్లో వెస్టిండీస్ 72 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్లో తర్వాత బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విండీస్.. స్టార్ ప్లేయర్లున్న ఎలెవన్ జట్టును మట్టికరిపించింది. తద్వారా ఏకైక టీ20 మ్యాచ్లో విండీస్ 72 పరుగుల తేడాతో గెలిచింది.
ముందుగా టాస్ గెలిచిన వరల్డ్ ఎలెవెన్ కెప్టెన్ అఫ్రీది ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో విండీస్ ఇన్నింగ్స్ను ఆరంభించిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
భారీ అంచనాలున్న విండీస్ ఓపెనర్ గేల్(18).. వరల్డ్ ఎలెవెన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. మరో ఎండ్లో లెవిస్ మాత్రం బౌలర్లపై విరుచుకుపడి హాఫ్ సెంచరీ సాధించాడు. 26 బంతులను ఎదుర్కొన్న లెవిస్.. ఐదు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 58 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మన్లలో శామ్యూల్స్(43), రామ్దిన్(44) రాణించగా, చివర్లో రస్సెల్(21) మెరుపులు మెరిపించాడు.