హైదరాబాద్: బ్రిస్టల్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో వెస్టిండిస్ జట్టు పరుగుల వరద పారించారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెస్టిండిస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ జట్టు 49.2 ఓవర్లలో 421 పరుగులు చేసి ఆలౌటైంది. వెస్టిండిస్ బ్యాట్స్మెన్లలో హోప్ 86 బంతుల్లో 101(9 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో చెలరేగగా ఆండ్రీ రస్సెల్ 25 బంతుల్లో 54(7 ఫోర్లు, 3 సిక్సులు), లివీస్ 54 బంతుల్లో 50(6 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
🌴v 🇳🇿
— Windies Cricket (@windiescricket) May 28, 2019
Welcome back @Russell12A!
53 runs from 23 balls!#WIvNZ #MenInMaroon #ItsOurGame pic.twitter.com/WXYgARymP5
ఆ తర్వాత హెట్మెయిర్ (47), క్రిస్ గేల్ (36) రాణించడంతో వెస్టిండిస్ ఏకంగా నాలుగు వందల పరుగులు మైలురాయిని అందుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీయగా హెర్నీ రెండు, జేమ్స్ నీశమ్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
A classy knock in the warm up from @shaidhope! 💯🏏 #WIvNZ #MenInMaroon #ItsOurGame pic.twitter.com/0VzyZJg7kA
— Windies Cricket (@windiescricket) May 28, 2019