
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఆ తర్వాత మ్యాచ్లో పుంచుకున్న తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ హాఫ్ సెంచరీలతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. డిసిల్వా 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు నమోదు చేశాడు. మరోవైపు మహనామ జాగ్రత్తగా ఆడి 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు.

భారత్ విజయ లక్ష్యం 252 పరుగులు
అనంతరం 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ నెమ్మదిగా ఆడటంతో 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజహరుద్దీన్ డకౌట్ కావడంతో 99 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నుంచీ భారత్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

స్టాండ్లకు నిప్పుపెట్టిన అభిమానులు
వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు భారత బ్యాట్స్మెన్ పరుగులేమీ చేయకుండా డకౌట్గా వెనుదిరిగారు. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా బ్యాట్స్మెన్ నిష్క్రమించడంతో మైదానంలోని ప్రేక్షకులు స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది.

తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్
ఆట మళ్లీ మొదలైన కాసేపటి తర్వాత కూడా అభిమానుల గొడవ కొనసాగించారు. మరోసారి మైదానంలోకి బాటిళ్లు విసిరారు. దీంతో ఈ మ్యాచ్కు రిఫరీగా ఉన్న వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోరు ప్రకారం శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. దీంతో తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫైనల్లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది.


Click it and Unblock the Notifications












