వరల్డ్ కప్: గాయం, యూఏఈతో జరిగే మ్యాచ్కి షమీ దూరం
పెర్త్: ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా ఫిబ్రవరి 27(శనివారం)న భారత్-యూఏఈల మధ్య పెర్త్లో జరగనున్న మ్యాచ్లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. అతని స్ధానాన్ని భువనేశ్వర్ కుమార్ భర్తీ చేయనున్నాడు.
పేసర్ మహమ్మద్ షమీకి ఎడమ మోకాలికి గాయం కారణంగా అతనిని మ్యాచ్ నుంచి తప్పించినట్లు టీమిండియా మీడియా మేనేజర్ ఆర్ బాబా తెలిపారు. గురువారం నాడు షమీకి ఆల్ట్రా సౌండ్ ఇంజెక్షన్ ఇచ్చామని దీంతో అతని శనివారం జరిగే మ్యాచ్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

జట్టులో షమీ స్ధానాన్ని భువనేశ్వర్ కుమార్ భర్తీ చేయనున్నట్లు తెలిపాడు. ఐసీసీ టోర్నమెంట్లో ఇప్పటి వరకు టీమిండియా ఆడిన మ్యాచ్ల్లో ఎక్కువ వికెట్లు షమీ తీసుకున్నాడు. పాకిస్ధాన్, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల్లో షమీ 10.83 సగటుతో 6 వికెట్లు తీసుకున్నాడు.
రెండు ఇన్నింగ్స్ల్లో 17 ఓవర్లు వేసిన షమీ, 2 మేడిన్లతో 6/65గా నమోదు చేశాడు. పాకిస్ధాన్పై జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసుకోగా, దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసుకున్నాడు. 24 ఏళ్ల మహమ్మద్ షమీ ఇప్పటి వరకు 42 వన్డేలు ఆడి 76 వికెట్లు తీసుకున్నాడు. మార్చి 6న వెస్టిండిస్తో జరిగే మ్యాచ్కి తిరిగి జట్టులోకి వస్తాడని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications