పెర్త్: ప్రపంచకప్ టోర్నీలో భాగంగా పెర్త్ వేదికగా శనివారం యుఏఈతో జరగుతున్న మ్యాచులో భారత్ విజయం సాధించింది. యుఏఈ నిర్దేశించిన 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 18.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచులో రోహిత్ శర్మ బౌండరీలతో చెలరేగి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 55 బంతుల్లో 57(10ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 33 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి భారత్కు విజయాన్నందించారు.
కాగా, శిఖర్ ధావన్ (14) పరుగులు చేసి వెనుదిరిగాడు. శిఖర్ను యుఏఈ బౌలర్ మురుగ్ ఔట్ చేశాడు. అంతకుముందు యుఏఈ 102 పరుగులకు అలౌట్ అయింది. మ్యాచ్ ఆరంభం నుంచి తడబడుతూ ఆడిన యుఏఈ వికెట్లను వెంటవెంటనే జారవిడుచుకుంది. 71 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్లో యుఏఈ ఓపెనర్ బెరెంజర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.
ఆ తర్వాత అమ్జద్ అలీ 4, కృష్ణ చంద్రన్ 4, స్వప్నిల్ పాటిల్ 7 పరుగులు చేసి వెనువెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ఖుర్రమ్ ఖాన్ 14, రోహన్ ముస్తఫా 2, అమ్జద్ జావేద్ 2, నవీద్ 6, తౌకిర్ 1 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. షేమన్ 35 పరుగులు చేసి భువనేశ్వర బౌలింగ్ లో ఔటయ్యాడు. గురుగ్ 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు. కాగా, భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, జడేజా, భువనేశ్వర్ తలో 2 వికెట్లు తీయగా, యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు.