240 పరుగుల విజయ లక్ష్యంతో
మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీపైనల్లో 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి టీమిండియా 10 ఓవర్లకు గాను 24/4 స్థితిలో ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77) అద్భుతంగా పోరాడినప్పటికీ... మరో 3 బంతులు మిగిలుండగానే 221 పరుగులకేకుప్పకూలిన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఫిబ్రవరిలో వెల్లింగ్టన్ వేదికగా
అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో తొలి పవర్ ప్లేలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శుభమాన్ గిల్, ధోని వికెట్లను కోల్పోయ టీమిండియా 22/4 స్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
113 బంతుల్లో 90 పరుగులు చేసిన రాయుడు
ఈ క్రమంలో అంబటి రాయుడు 113 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీస్ మిడిలార్డర్లో అంబటి రాయుడు ఉంటే జట్టు ఫలితం మరోలా ఉండేదని నెటిజన్లు సోషల్ మీడియాలో అంటున్నారు.
స్టాండ్ బై జాబితాలో అంబటి పేరు
నిజానికి ఈ ప్రపంచకప్కు ఎంపిక చేసిన భారత జట్టులో అంబటి రాయుడితో పాటు రిషబ్ పంత్ని స్టాండ్బై జాబితాలో బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడి టోర్నీకి దూరమైనప్పుడు ఆ స్థానంలో రిషబ్ పంత్ను ఇంగ్లాండ్కు పిలిపించారు. ఆ తర్వాత రాయుడి స్థానంలో ప్రపంచకప్కు ఎంపికైన విజయ్ శంకర్ కూడా గాయపడ్డాడు.
రాయుడికి పిలుపు వస్తుందని అంతా!
దీంతో అంబటి రాయుడికి పిలుపు వస్తుందని అంతా భావించారు. అయితే, సెలక్టర్లు అనూహ్యంగా రాయుడిని కాకుండా విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేశారు. దీంతో మనస్తాపం చెందిన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అలా కాకుండా తొలి సెమీస్లో రాయుడి ఆడి ఉంటే టీమిండియా గెలిపించేవాడని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.